ఆత్మహత్యతో ముగిసింది!

18 June, 2008

గతవారం రోజులుగా కర్ణాటకలో తీవ్ర ఉత్కంఠ కలిగించిన పద్మప్రియ ఉదంతం చివరికి ఆమె ఆత్మహత్యతో ముగిసింది. పద్మప్రియ కర్నాటక లోని అధికార బి.జె.పి పార్టీ ఉడిపి ఎమ్.ఎల్.ఏ రఘుపతిభట్ భార్య. మొన్నటి ఎలక్షన్లలో ఇద్దరూ కలిసే ప్రచారం చేశారు. ఈ నెల 11వ తేదీన పద్మ ముల్కీ లోని తన పుట్టింటికి వెళుతున్నానని తనకారులో తానే డ్రైవ్ చేస్తూ బయలుదేరింది. కానీ అటు పుట్టింటికీ చేరలేదు ఇటు భర్త ఇంటికీ చేరలేదు. 13వ తారీఖున కుంజార్‍గిరి కొండలదగ్గర ఆమె కారు కనిపించింది. కార్లోని దృశ్యాన్ని బట్టి ఆమె కిడ్నాపయి ఉండవచ్చని భావించారు. 15వ తారీఖున వారి కుటుంబ మిత్రుడు ద్వారా ఆమె ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్ళిన వారికి పద్మప్రియ మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ కనపడింది. ఈ మొత్తం వ్యవహారంలో వీరి కుటుంబ మిత్రుడు అతుల్ ప్రమేయం అనుమానాస్పదంగా కనబడుతుంది. అతను పద్మతో పాటు ఢిల్లీ వెళ్ళి ఒక ప్లాట్ ని అద్దెకి తీసుకోవడంలో సహకరించాడు. మళ్ళీ ఉడిపి వచ్చి ఆమెభర్త రఘుపతి తో కలిసి ఆమెని వెతుకుతున్నట్లుగా నటించాడు. అతను చెప్పిన ప్రకారం ఆమె జూన్ 17వ తారీఖున ఉడిపి వచ్చేద్దామని అనుకుందట. అలా అనుకుంటే అక్కడ ప్లాట్ ని అద్దెకి తీసుకోవడమెందుకో అర్ధంకాదు. ఈ గొడవంతా టి.వీ ల్లో వచ్చేటప్పడికి కొంచెం భయపడి ఆత్మహత్య చేసుకుందని అనుకుంటున్నారు. భర్త పైన కూడ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంలో కొన్ని ప్రశ్నలు
1) అతుల్ చెప్పినట్టు రఘుపతి, పద్మప్రియ మధ్య ఏమైనా గొడవలున్నాయా
2) ఎన్నికల తరువాత పరస్పర అంగీకారం ద్వారా విడాకులు తీసుకుందామని నిర్ణయించుకుంటే, ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరమేంటి?
3) ఆమె కారుని ఎవరో ఎటాక్ చేసినట్లుగా సీన్ క్రియేట్ చేసిందెందుకు?
4) అతుల్ తో పాటుగా ఢిల్లీ ఎందుకెళ్ళింది?
5) సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ ఎందుకు చేశారు?
6) ఒకవేళ తిరిగి వచ్చే ఉద్దేశ్యమే ఉంటే ఢిల్లీనుండైనా ఎందుకు ఫోన్ చెయ్యలేదు?
7) ఆమెని ఎవరైనా తప్పుదారి పట్టించారా లేక ఆమె అనాలోచిత నిర్ణయమా?
8) చివరికి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది?
ఇందులో విలన్ అతులా, రఘుపతా లేక ఆమె ఖర్మా? నిజం ఎప్పటికైనా తెలిసేనా?
మరిన్ని వివరాలకు డైజీవర్ల్డ్ వెబ్ సైట్ ని క్రింది లింకులద్వారా చూడండి.
1
2
3
4
5
6

పూర్తి టపా చదవండి!

నారాయణ నారాయణా... ఏంపనయ్యా ఇది!

13 June, 2008

పేదలను, బలహీన వర్గాలను అణగతొక్కుతున్నారని ఎల్లప్పుడూ వాపోయే పార్టీ అది. తాము పుట్టిందే వారిని ఉద్దరించడానికని గప్పాలు కొట్టుకునే పార్టీ. నేపాల్ లో రాజరికానికి వ్యతిరేకంగా మావోయిస్టులు జరిపినపోరాటానికి మద్దతిచ్చిన పార్టీ. నేపాల్ మావోయిస్టులే తమకు ఆదర్శం అని డప్పుకొట్టుకోవడం వారికలవాటు. అవకాశం వస్తే తామూ రాజదర్పానికి అతీతులంకాదు అని చెప్పే చిత్రం నేటి ఈనాడు దినపత్రిక ద్వారా... పేదవాడి కోసం జరుపుతున్నామంటున్న ఈ భూ(ఆక్రమణ)పోరాటంలో పేదవాడి నెత్తికెక్కడమా? నారాయణా ఏంపనయ్యా ఇది, హవ్వ!

పూర్తి టపా చదవండి!

తోలుబొమ్మలాట

12 June, 2008


సమయం: తెలంగాణా మధ్యంతర ఎన్నికల ముందు, తరువాత
స్థలం: ఆంధ్రప్రదేశ్ (కొంతమంది ఈమధ్య దీనిని మధ్యాంధ్రప్రదేశ్ అని కూడా అంటున్నారు)
విషయం: తెలంగాణా పై టి.డి.పి వైఖరి
ఆడేది: దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్
ఆడించేది: ఎవరు? (చంద్రబాబేమో అని కొందరి అనుమానం)
ఎందుకు: ఏమో! (గౌడ్ ని పొమ్మనకుండా పొగబెడుతున్నాడేమోనని అనుమానం)
వీక్షకులు: మనమే :)
ఇంకెందుకాలస్యం? ఎంజాయ్...

కార్టూన్: ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికనుండి [కొద్దిగా సొంత పైత్యం తగిలించాను :) ]

పూర్తి టపా చదవండి!

సదుద్దేశం తెచ్చిన ఆదృష్ఠం

09 June, 2008

ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడానికి లాటరీ మార్గాన్నెంచుకున్న వ్యక్తికి లాటరీ తగిలి కోటిరూపాయలు చేతికందాయి. ముస్తపా బీరోలీ (ఫొటోలో వ్యక్తి) అనే వ్యక్తి దుబాయ్ లో పనిచేస్తున్నాడు. అతనికి నిస్సార్ అనే స్నేహితుని ద్వారా నౌషాద్ అనే అతని పరిచయం ఏర్పడింది. ముస్తఫాదీ మరియ నౌషాద్ అనేవ్యక్తిదీ ఒకే ప్రాంతం కేరళలోని కుంజిపల్లి కావడంతో ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. నౌషాద్ తండ్రి ఒక మత్స్యకారుడు, ఆయన కేన్సర్ తో మరణించడంతో నౌషాద్ ఉద్యోగ నిమిత్తం, అప్పటికే దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న సోదరుని సాయంతో దుబాయ్ లో ఒక హోటల్ లో పనికి కుదిరాడు. కొన్నాళ్ళ తరువాత ఎడమ కాలి రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడి కాలు వాయడంతో దుబాయ్ లోనే ట్రీట్‍మెంట్ తీసుకున్నాడు. అక్కడ ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ కావడంతో అతని సోదరుడు కేరళకు పంపించి వేశాడు. కేరళలో ఒక బ్యాంక్ నుండి రుణం తీసుకుని వైద్యం పూర్తిచేసుకుని మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి దుబాయ్ వెళ్ళి మళ్ళీ హోటల్ పనిలోచేరాడట. స్నేహితుని కోసం ఏదైనా చేయాలని అనుకున్న బీరోలీ, ఇదివరకూ లాటరీకొనే అలవాటు లేనప్పటికీ ఒక లాటరీ టికెట్ కొన్నాడట. అదృష్టం పండి దానికే ఒక మిలియన్ దిర్హామ్ ల డబ్బు చేతికొచ్చింది. దాంతో స్నేహితుని ట్రీట్‍మెంట్ అప్పు 60,000 తో పాటుగా తాను చేయాలనుకున్న ఇతర మంచి పనులన్నీ చేయొచ్చని బీరోలీ తెగ ఆనంద పడిపోతున్నాడు. అలాగే కొంత డబ్బుని ఏడుగురు సభ్యులున్న తన స్వంత కుటుంబ అవసరాలకు వాడుకుంటానినికూడా అన్నాడు.
మరిన్ని వివరాలు గల్ఫ్ న్యూస్ ద్వారా:

ఈ న్యూస్ కొన్ని పేరాలు చదివిన తరువాత ఎంత మంచి మనసో అనిపించినా చివరికి వచ్చేసరికి నాకూ ఓకోటి లాటరీ వస్తే లక్షని మంచి పనులకి ఖర్చు పెట్టడానికి వెనుకాడుతానా అనిపించింది. అందరూ ఇలాగే ఆలోచిస్తారా? ఏమో!

పూర్తి టపా చదవండి!

హమ్మయ్య, దీని ధర పెరగదు

06 June, 2008

అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి, దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగింది తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీసిల్, వంట గ్యాస్ ల రేట్లను భారీగా పెంచింది. ఈ పెట్రో ఉత్పత్తుల పెంపువలన కూరగాయల ధరలు పెరగొచ్చు, ఉప్పు పప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగొచ్చు, పాల ధర పెరగొచ్చు, హోటల్ లో పెట్టే తిండి ధర పెరగొచ్చు, సైకిళ్ళ రేట్లూ పెరగొచ్చు, జట్కా బళ్ళ మరియు ఎద్దుల బళ్ళ కి డిమాండ్ పెరిగి వాటిరేట్లూ పెరగొచ్చు, సిమెంటు రేటు పెరగొచ్చు, ఉక్కు రేటు పెరగొచ్చు, టాటాల లక్షకారు రేటు లక్షన్నర కావచ్చు, బస్సు చార్జీలూ పెరగొచ్చు, .... .... .... .... .... .... .... ... ... . ఈనాడు ఆంధ్రజ్యోతి వగైరా దినపత్రికలు నాల్గురూపాలవ్వచ్చు, కానీ... ఆంధ్రావాలా అదృష్టం సాక్షి రేటు ఎన్నటికీ మారదు, అది ఎప్పటికీ రెండు రూపాయలే! రండి.. సాక్షి రంగుల లోకంలో మైమరచిపోండి, 32 పేజీల సమాచార ప్రవాహంలో కొట్టుకుపోండి!

పూర్తి టపా చదవండి!

చిన్న పొరపాటు...

05 June, 2008

వర్డ్ ప్రెస్ ని బ్లాగ్ ప్లాట్‍ఫాం గా వాడేవాళ్ళకి 'టేగ్' మరియు 'కేటగిరి' లకి తేడా బాగా తెలుసుంటుంది. కానీ బ్లాగర్ లో లేబుల్ మాత్రమే ఉంటుంది. మొదట్లో ఈ లేబుల్ అనేది కేటగిరీన లేక టేగ్గా అనేది అర్ధంగాక చాలా లేబుల్స్ ని క్రియేట్‍చేయడం జరిగింది. నాకొచ్చిన అనుభవాన్ని బట్టి ఈ లేబుల్ అనేది కేటగిరీ అని అర్ధమయింది. ప్రస్తుతం ఉన్న లేబుల్స్ సంఖ్య నా పోస్టులకన్నా ఎక్కువున్నాయి. అందుకని రానున్న నాలుగురోజులలో మొత్తం పోస్టులను అప్‍డేట్ చేసి తద్వారా అధికంగా ఉన్న లేబుల్స్ లను తొలగించాలనుకుంటున్నాను. అందువలన కూడలి, తేనెగూడు, జల్లెడ మొదలైనచోట్ల నా బ్లాగ్ కి సంబంధించిన దాదాపు చాలా పోష్టులు ఒకే సారి మళ్ళీ కనిపించవచ్చు. అసౌకర్యానికి ముందస్తు క్షమాపణలు.

పూర్తి టపా చదవండి!

లేబర్ రైలు: ఆలూ లేదూ.. చూలూ లేదు...

04 June, 2008

కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది ఈ లేబర్ రైలు పరిస్థితి. చిరు తన పార్టీకి పేరు ఇంకా పెట్టాడో లేదో గానీ చిరు చిరు అభిమానులు మాత్రం పేపర్లలో వచ్చిన వార్తలని పట్టుకుని తమ టేలంట్ ని నిరూపించుకుంటున్నారు. ఈమధ్యన పేపర్లలో చిరు పార్టీ పేరు లేబర్ పార్టీ అని, రైలు బండి పార్టీ గుర్తు అని వచ్చిన పుకార్లకు చిరు అభిమానుల సమాధానం ఇదిగో, ఈ క్రింది బొమ్మ. ఇందులో నిజమెంతో గానీ ఇది చిరంజీవి పార్టీ అధికారిక జెండా అన్నంతగా ప్రచారం చేసేస్తున్నారు. బ్రతికేది కొద్దికాలమైనా, మహారాజులా బ్రతకాలని సామెత. ప్రస్తుతం ఈ జెండా అంతర్జాలంలో మహారాజభోగం అనుభవిస్తోంది అనడం అతిశయోక్తి కాదేమో!
[ఈ బొమ్మ నాకు ఈమెయిల్ ద్వారా ఒక స్నేహితుడివద్దనుండి వచ్చింది. ఈ బొమ్మ యొక్క హక్కులు దాని అసలు యజమానివే, నావి కాదు.]

పూర్తి టపా చదవండి!